రష్మికా…మిషన్ మజ్ను ఎప్పుడో తెలుసా?

93
rashmika
- Advertisement -

హిట్,ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది రష్మికా మందన్నా. ‘మిషన్ మజ్ను’ అనే స్పై థ్రిల్లర్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది రష్మికా. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తుండగా 2022 మే 13న సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

మిషన్ మజ్ను భారతదేశం రహస్య గూఢచార సంస్థ ‘రా’ పాకిస్తాన్ అతిపెద్ద రహస్య మిషన్ ను నిర్వహిస్తుంది. యాడ్ ఫిల్మ్ మేకర్ శంతను బాగ్చి ఈ చిత్రానికి దర్శకుడు. బాలీవుడ్ అగ్ర నిర్మాత రోనీ స్క్రూవాలా అమర్ బుటాలా, గరిమా మెహతాతో కలిసి దీనిని నిర్మిస్తున్నారు.

ఇటీవలే షూటింగ్ పూర్తైన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఇక రష్మికా నటించిన ‘పుష్ప’ డిసెంబర్ 17న 5 భాషలలో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఇది రానుంది.

- Advertisement -