బద్వేల్‌లో వైసీపీ భారీ మెజార్టీ..

113
Badvel
- Advertisement -

బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ రికార్డు స్ధాయి మెజార్టీని సాధించింది ఆ పార్టీ అభ్యర్థి దాసరి సుధ. గతంలో ఆమె భర్త దాసరి వెంకట సుబ్బయ్య సాధించిన మెజార్టీని ఆమె క్రాస్ చేసింది. గత ఎన్నికల్లో వెంక‌ట సుబ్బ‌య్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా ఇప్పటికే ఆ మెజార్టీని దాటి ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి ఆమె 68,492 ఓట్ల మెజారిటీని సాధించారు.

8వ రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 9691, బీజేపీ 1964, కాంగ్రెస్‌కు 774 ఓట్లు పోలయ్యాయి. ఈ ఏడాది మార్చి 28న వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో క‌న్నుమూశారు. దీంతో బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

- Advertisement -