- Advertisement -
ఈ నెల 28న కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యూలర్ జారీ చేశారు. ప్రధానంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమంతో పాటు తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై చర్చించనున్నారు.
ఈ సమావేశానికి కలెక్టర్లతోపాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారు. జూలై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
- Advertisement -