- Advertisement -
నాగార్జున సాగర్ నియోజకవర్గ బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్ టీ ఆర్ ఎస్ లో చేరారు .ముఖ్యమంత్రి ,టీ ఆర్ ఎస్ అధినేత కె .చంద్రశేఖర్ రావు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు .ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యేలు సైది రెడ్డి ,రవీంద్ర కుమార్ ,పలువురు నల్లగొండ జిల్లా నేతలు పాల్గొన్నారు. వందలాది మంది కార్యకర్తలతో కలిసి ఆయన గులాబీ పార్టీలో చేరారు.
కడారి అంజయ్య యాదవ్కు.. సీఎం కేసీఆర్ కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అంజయ్య యాదవ్ చేరికతో సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరింత పటిష్టంగా తయారైంది. సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ టికెట్ ఆశించిన అంజయ్య యాదవ్కు ఆ పార్టీ అధిష్ఠానం మొండి చెయ్యి చూపడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకొని సీఎం కేసీఆర్ సమక్షంలో ఇవాళ పార్టీలో చేరారు.
- Advertisement -