నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌..

514
cm kcr
- Advertisement -

చైనా-భారత్‌ బార్డర్‌ దాడిలో వీరమరణం పోందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేడు కలవనున్నారు. సీఎం సూర్యాపేటలోని సంతోష్‌ గృహంలో వారిని కలిసి పరామర్శించనున్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా అందించనున్నారు. 

కాగా కల్నల్‌ సంతోష్‌ బాబును తెలంసంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, ఇంటి స్థలం, గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన సీఎం తానే స్వయంగా వెళ్లి ఆ సహాయాన్ని అందిస్తానని తెలిపారు. సంతోష్‌ భార్య సంతోషికి గ్రూప్‌-1 ఉద్యోగం, హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో ఇంటిస్థలం ఇవ్వనుంది ప్రభుత్వం.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో జనాలు గుమికూడకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకోగా విద్యానగర్ కాలనీ మొత్తాన్ని సోడియం హై పో క్లోరోడ్ ద్రావణం తో శానిటేషన్ చేశారు మున్సిపల్ సిబ్బంది.

- Advertisement -