కల్నల్ సంతోష్ అంతియ యాత్ర…

255
santhos
- Advertisement -

దేశం కోసం పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర ప్రారంభమైంది. సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన స్వగృహం నుంచి వ్యవసాయ క్షేత్రానికి పార్థీవ దేహాన్ని తరలిస్తున్నారు.

చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర ప్రారంభమైంది. సంతోష్ పార్థీవ దేహంపై త్రివర్ణ పతాకం ఉంచారు సైనికాధికారులు. పూలతో అలంకరించిన వాహనంలో కల్నల్ మృతదేహాన్ని ఉంచే ముందు సైనిక వందనం సమర్పించారు. ఆర్మీ ఉన్నతాధికారులతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

సంతోష్ బాబు మృతదేహం వద్ద అతడి తల్లిదండ్రులు, భార్య, ఇతర కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. కల్నల్ సంతోష్ బాబు అమర్ రహే అంటూ.. స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.కరోనా వైరస్ నేపథ్యంలో అంత్యక్రియలు జరిగే కేసారం వ్యవసాయక్షేత్రంలో కేవలం 50 మందికి మాత్రమే అనుమతించనున్నారు.

- Advertisement -