జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ..

276
modi
- Advertisement -

ఈ నెల 21న జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని.ఉదయం 7 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభమవుతుంది.

తొలుత ఈ ప్రసంగాన్ని లద్దాఖ్‌లోని లేహ్‌ నుంచి చేయాలని మొదట నిర్ణయించగా… కోవిడ్‌ నేపథ్యంలో ఢిల్లీ నుంచే ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యోగా విశిష్టత గురించి ఆయన వివరించనున్నారు.

దీంతో పాటు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇండియా ప్రతిస్పందనను కూడా మోడీ ప్రస్తావించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014 డిసెంబర్‌ 11న ఐరాస ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -