కోహెడ మార్కెట్ పనులను పరిశీలించిన మంత్రులు..

350
- Advertisement -

రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్న మార్కెట్ పనులను నేడు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి,మంచిరెడ్డి కిషన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

sabith

మామిడి కాయల సీజన్ కావడంతో కొత్తపేట్‌లోని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్‌లో కొనాల్సిన మామిడి కాయలని ఇక్కడ కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు పనులు వేగవంతము చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని.. కరోనా మహమ్మరికి తరిమిటాలన్నారు.

- Advertisement -