- Advertisement -
తెలంగాణ కేబినెట్ మరోసారి సమావేశం కానుంది. ఈ నెల 19న ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2:30 గంటలకు భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు యథావిధిగా కొనసాగించడమా? లేక ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశాలపై చర్చించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోనుంది.
- Advertisement -

