భార‌త్‌లో క‌రోనా @ 724

201
india covid 19
- Advertisement -

భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌లో 724 కేసులు న‌మోదుకాగా 17 మంది మృతి చెందిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న 66 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప‌రిశీలిస్తే కేరళలో అత్యధికంగా 137, మహారాష్ట్రలో 135, కర్ణాటకలో 55, రాజస్థాన్‌లో 45, తెలంగాణలో 45 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

గుజరాత్‌లో 44, ఉత్తరప్రదేశ్‌లో 42, ఢిల్లీలో 39, పంజాబ్‌లో 33, హర్యానాలో 32, తమిళనాడులో 29, మధ్యప్రదేశ్‌లో 20, జమ్మూకశ్మీర్‌లో 14, లడఖ్‌లో 13,ఆంధ్రప్రదేశ్‌లో 11, పశ్చిమ బెంగాల్‌లో 10, బీహార్‌లో 9, చండీఘర్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, గోవాలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 2, మణిపూర్‌, మిజోరాం, పుదుచ్చేరిలో ఒక్కొక్క కేసు నమోదైంది.

- Advertisement -