కరోనా గురించి వింటుంటే షాకింగ్ గా ఉంది

340
Director Rajamouli
- Advertisement -

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగామంది ఈ వ్యాధి బారిన పడ్డారు. కరోనా ఎఫెక్ట్ తో చాలా బిజినెస్ లు కూడా దెబ్బతిన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్ధలు, పార్క్ లు, థియేటర్లను మూసివేశారు. సినిమా షూటింగ్ లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతల మండలి.

తాజాగా కరోనాపై రాజమౌళి సంచలన ట్వీట్ చేసాడు. కరోనా కారణంగా ప్రపంచమే స్థంభించి పోవడం చూస్తుంటే షాకింగ్‌గా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు ప్రామాణికంగా ఏమి చేయాలో అది చేస్తే బాగుంటుందన్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈమూవీలో ఎక్కువమంది విదేశీ నటులు ఉండటంతో ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజులు రద్దు చేశారు.

- Advertisement -