కివీస్ వైట్ వాష్.. కోహ్లీ సేన ప్రపంచ రికార్డు

480
india vs newzealand
- Advertisement -

వరుస విజయాలతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌…ఐదో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అంతేగాదు ఈ విజయంతో ప్రపంచ రికార్డు సృష్టించింది భారత్. ఇప్పటివరకు ఏ జట్టు కూడా టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన చరిత్ర లేదు. 5-0తో కీవిస్ ను ఓడించి   అరుదైన ఘనతను కోహ్లీ సేన అందుకుంది.

భారత్ విధించిన 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్  నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి  156  పరుగులు చేసింది. ఓ దశలో గెలుపు కివీస్ గెలుపు ఖాయమని అంతా అనుకోగా ఉహించని విధంగా భారత్ బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ ఓటమి లాంఛనమే అయింది. రాస్ టేలర్ 53, సైఫిర్ట్ 50 పరుగులతో రాణించగా మిగితా బ్యాట్స్‌ మెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో శివమ్ దుబే ఒకే ఓవర్లలో 34 పరుగులిచ్చి చెత్త బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు.

అంతకముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి నిరాశపర్చగా రోహిత్ 60, లోకేశ్ రాహుల్ 45 ,శ్రేయాస్ అయ్యార్ 33 పరుగులు చేశారు. దీంతో భారత్ 3 వికెట్లు కొల్పోయి 163 పరుగులు చేసింది.

- Advertisement -