మున్సిపల్‌ ఎన్నికలకు కోఆర్డినేటర్లను నియమించిన టీఆర్ఎస్

432
ktr
- Advertisement -

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు అభ్యర్దులు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే జిల్లాల్లోని కొన్ని వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ బోణీ చేసింది. 34వ వార్డు కౌన్సిలర్‌గా దార్ల కీర్తన సందీప్‌ ఏకగ్రీవం అయ్యారు. ఇక మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపల్‌ ఎన్నికలకు ఉమ్మడి జిల్లాల వారీగా కోఆర్డినేటర్లను నియమించింది. 9 జిల్లాలకు సీనియర్‌ నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నియమించారు.

వరంగల్‌-బాలమల్లు,
కరీంనగర్‌-బొంతు రామ్మోహన్‌,
రంగారెడ్డి-ఎమ్మెల్సీ నవీన్‌,
మహబూబ్‌నగర్‌-డీకే శివకుమార్‌,
ఆదిలాబాద్‌- దండె విఠల్‌,
ఖమ్మం-గట్టు రామచంద్రరావు,
మెదక్‌-శేరి సుభాష్‌రెడ్డి,
నిజామాబాద్‌-మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి,
నల్గొండ-పల్లా రాజేశ్వర్‌రెడ్డి

- Advertisement -