ఓ వైపు నిరసన…మరోవైపు వీఆర్వోకు షాక్‌

544
gundala mro
- Advertisement -

ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు నిరసనబాట పట్టారు. విధులకు నల్ల బ్యాడ్జిలతో హాజరైన ఉద్యోగులు నిందితుడిని కఠినంగా శిక్షించి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ క్రమంలో యాదాద్రి జిల్లా గుండాల ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపే క్రమంలో ఓ మహిళ వీఆర్వోను నిలదీసింది. లంచం తీసుకుని పాస్ బుక్ ఇంతవరకు ఇవ్వలేదని మండిపడింది. పాస్‌బుక్‌ల కోసం తిరిగి తిరిగి విసిగిపోయామని..డబ్బులు తీసుకున్న పాస్ బుక్ ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -