వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీమ్ఇండియా 203 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో షమీ(5/35), జడేజా(4/87) అద్వితీయ ప్రదర్శనతో సఫారీలను కుప్పకూల్చారు.
395 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 63.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. చివరి రోజు ఆటలో టీమ్ఇండియాకు తొమ్మిది వికెట్లు కావాల్సి ఉండగా.. రెచ్చిపోయిన బౌలర్లు సఫారీ జట్టును చుట్టేశారు.
కాగా, తొలి ఇన్నింగ్స్ లో 215 పరుగులతో మయాంక్ అగర్వాల్ రాణించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రోహిత్ శర్మ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్- 502/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్- 323/4
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్- 431, రెండో ఇన్నింగ్స్- 191 ఆలౌట్