- Advertisement -
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యపరిస్ధితి విషమంగా ఉంది. గుండెపోటు రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.
ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న అరుణ్ జైట్లీని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ లతోపాటు పలువురు కేంద్రమంత్రులు పరామర్శించారు. అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వ్యైద్యులను అడిగి తెలుసుకున్నారు.
గత కొంతకాలంగా అరుణ్ జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచినా ఆయన ఆరోగ్య పరిస్ధితి సరిగ్గా లేకపోవడంతో మంత్రి వర్గంలోకి తీసుకోలేదు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
- Advertisement -