లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరో నితిన్ ఒక్కసారిగా మూడు సినిమాల్ని స్టార్ట్ చేసేశాడు. వెంకీ కుసుమ దర్శకత్వంలో ‘భీష్మ’తో పాటు చంద్రశేఖర్ యేలేటీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా ఇవాళ మరో కోత్త మూవీని ప్రకటించారు నితిన్.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాలో నటిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా టైటిల్ను కూడా ఖరారు చేసింది చిత్రయూనిట్. రంగ్దే.. గివ్ మీ సమ్ లవ్ అనేది ట్యాగ్ లైన్తో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తిస్థాయి లవ్ ఎంటర్ టైనర్గా రానుంది. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ కథానాయకిగా నటించనుంది. 2020 వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇక చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్తో పాటు ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
.@actor_nithiin and @KeerthyOfficial are coming together for the first time in #Rangde. Movie will be directed by @dirvenky_atluri and produced by @vamsi84 with @pcsreeram as dop.
Summer 2020 Release. pic.twitter.com/WAPK7PSYHz
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 24, 2019