- Advertisement -
బలూచిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. 9 మంది దారుణ హత్యకు గురయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న 9 మందిని చంపారు గుర్తు తెలియని దుండగులు. పాకిస్థాన్లోని బలూచిస్తాన్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు సాయుధ దుండగులు.
గురువారం సాయంత్రం ప్రయాణికులను కిడ్నాప్ చేసి చంపేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. బుల్లెట్ గాయాలతో ఉన్న మృతదేహాలు రాత్రిపూట పర్వతాల్లో దొరికాయన్న ప్రభుత్వ అధికారి నవీద్ ఆలం తెలిపారు. అయితే ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడారనే దానిపై ఇంకా రాని క్లారిటీ రాలేదు.
Also Read:సాగునీటి గోస..కాంగ్రెస్దే పాపం!
- Advertisement -

