ఏపీలో కొత్తగా 7,796 మందికి పాజిటివ్..

109
corona
- Advertisement -

ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 89,732 కరోనా పరీక్షలు నిర్వహించగా… 7,796 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 1,302 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,210 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 147 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 14,641 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో కరోనాతో 77 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది మరణించారు. ఇప్పటిదాకా ఏపీలో కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 11,629కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 17,71,007 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 16,51,790 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,07,588 మందికి చికిత్స కొనసాగుతోంది.

- Advertisement -