టీ20 వరల్డ్‌ కప్‌ 2022 జరిగే వేదికలు ఇవే..

182
- Advertisement -

టీ20 ప్రపంచకప్ 2021 ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఫైనల్స్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డగా.. ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా సోంతం చేసుకుంది. ఇదిలావుంటే.. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ 2022 ఆస్ట్రేలియాలో జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పుడు ఈ టోర్నీకి సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

తాజాగా టీ20 ప్రపంచకప్ 2022 ను నిర్వహించే వేదికలను ఐసీసీ అధికారులు ఖరారు చేశారు. మొత్తం 7 నగరాల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందుకు బ్రిస్బేన్, అడిలైడ్, గీలాంగ్, హోబార్ట్, పెర్త్, సిడ్నీ, మెల్బోర్న్ నగరాలను వేదికలుగా అధికారులు ప్రకటించారు. ఫైనల్స్ మ్యాచ్ కు మెల్బోర్న్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సెమీ ఫైనల్స్ సిడ్నీ, అడిలైడ్ లో జరగనున్నాయి.

- Advertisement -