ఐపీఎల్ పై హైకోర్టులో పిల్

454
ipl
- Advertisement -

ఈ ఏడాది ఐపీఎల్ జరగకుండా ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ జరగకుండా బీసీసీఐ ఎలాంటి ముందస్తు  చర్యలు తీసుకోలేదని సంపత్ కుమార్ అనే ఐపీఎస్ అధికారి పిల్‎లో పేర్కొన్నారు.

ఓ విచారణ అధికారిగా ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‎ను బయటపెట్టానని పిల్‎లో పేర్కొన్నారు. ఐపీఎల్‎లో ఆడే 8 జట్లను ప్రతివాదులుగా సంపత్ కుమార్ చేర్చారు. గతంలో బెట్టింగ్ స్కామ్‎లో బుకీల నుంచి లంచాలు తీసుకున్నారన్న అరోపణలపై సంతపత్ కుమార్‎ను నాలుగేళ్లపాటు సస్పెండ్ చేశారు.

ipl pil

ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేయడంతో మళ్లీ విధుల్లోకి హాజరైన సంపతకుమార్. ఐపీఎల్‎ను నిరోదించమని తాను అనడం లేదని, ఐపీఎల్ కొత్త సీజన్ మొదలయ్యే ముందుబెట్టింగు నిరోదించే కమిటీ ఏర్పాటు చేయాలని తన వినతి అని పిల్‎లో సంపత్ పేర్కొన్నారు.

ఈ వ్యవస్థను ఏర్పాటు చేయకుండ బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిల్‎లో కోరారు. ఈనెల 7నుంచి ఐపీఎల్ 11వ సీజన్ మొదలవనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -