పల్లెల్లో జోష్..50శాతం పోలింగ్

229
voting
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి 50 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి 70 శాతానికి పైగా పోలింగ్ జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పట్టణ ప్రజల నుండి నిరాసక్తత వ్యక్తమవుతుండగా పల్లెల్లో మాత్రం మంచి స్పందన వస్తోంది. మహిళలు,వృద్ధులు,వికలాంగులు ఓటు వేసేందుకు ఉత్సాహం కనబర్చారు. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు తరలి ఓటు వేసి వస్తున్నారు.

హైదరాబాద్‌లో ఓటింగ్ సరళి మాత్రం నత్తనడకన సాగుతోంది. వరుసగా సెలవలు రావడంతో వారి స్వగ్రామాలకు వెళ్లడానికి ఆసక్తి చూపారని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. అత్యధికంగా వికారాబాద్‌లో 55 శాతం పోలింగ్ జరుగగా అత్యల్పంగా హైదరాబాద్‌లో నమోదైంది.

- Advertisement -