టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..

420
trs mlcs oath
- Advertisement -

శాసన మండలికి ఎన్నికైన నలుగురు టిఆర్‌ఎస్ సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 10.40 గంటలకు కొత్త ఎమ్మెల్సీల చేత శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు తన ఛాంబర్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కె నవీన్‌ కుమార్‌తో పాటు పట్నం మహేందర్ రెడ్డి,తేరా చిన్నపరెడ్డి,పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, లతో పాటు ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీ, ఆనంద్, మహేష్ రెడ్డి, సుభాష్ రెడ్డి,బాల్క సుమన్, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్సీలు కర్నె ప్రభాకర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

- Advertisement -