తెలంగాణ ఐటీ శాఖకు 4 అవార్డులు..

50
- Advertisement -

తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PRCI) ఎక్సలెన్స్ అవార్డులను ఐదు విభాగాలలో గెలుచుకుంది. న్యూఢిల్లీలో 2023 సెప్టెంబర్ 21 మరియు 22 తేదీల్లో జరిగిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ లో ఈ అవార్డులను ప్రదానం చేశారు.మాజీ కేంద్ర మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం “సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును అందుకున్నారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును పీఆర్సీఐ అందజేస్తుంది.
ఈ అవార్డుతో పాటు, డిజిటల్ మీడియా విభాగం 2023 సంవత్సరానికి గాను మరో నాలుగు పీఆర్సీఐ ఎక్సలెన్స్ అవార్డులను గెలుచుకుంది.

Also Read:ప్చ్.. ప్లాప్ కాంబినేషన్ పై భారీ బడ్జెట్?

1) సోషల్ మీడియా ఉత్తమ వినియోగం అవార్డు

2) ఉత్తమ వార్షిక నివేదిక అవార్డు (తెలంగాణ ఐటీ శాఖ వార్షిక నివేదిక 2022-23కి)

3) ప్రజా సేవల ప్రకటనల అవార్డు (“మన ట్యాంక్‌బండ్‌ని శుభ్రంగా, అందంగా ఉంచుకుందాం” వీడియోకి)

4) ఉత్తమ ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిల్మ్స్ (“కాళేశ్వరం -తెలంగాణ జల విప్లవం” వీడియోకి)

తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తరపున సహాయ సంచాలకులు, డిజిటల్ మీడియా ముడుంబై మాధవ్, డిజిటల్ మీడియా కన్సల్టెంట్ నరేందర్ గుండ్రెడ్డి ఈ అవార్డులు అందుకున్నారు.

ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం జూన్, 2014లో ఏర్పాటు చేయబడింది.తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని మరియు సేవలను డిజిటల్ మధ్యమాలలో పౌరులకు చేరవేయడం ఈ విభాగం ప్రధాన బాధ్యత.సామాజిక మధ్యమాల ఖాతాల సృష్టి, నిర్వహణ; వెబ్‌సైట్‌లు/పోర్టల్‌ల రూపకల్పన, అభివృద్ధి మరియు నిర్వహణ; ఓపెన్ గవర్నమెంట్ డేటా, కంటెంట్ స్థానికీకరణ, ఫ్యాక్ట్ చెక్, తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ కార్యక్రమాల అమలు డిజిటల్ మీడియా విభాగం యొక్క ఇతర ప్రధాన విధులు. సాంకేతిక సంస్థల నిపుణులచే ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి సామాజిక మధ్యమాలపై శిక్షణా కార్యక్రమాలను డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తుంది.

Also Read:బీఆర్ఎస్‌లోకి ఏపూరి సోమన్న!

- Advertisement -