రాష్ట్రంలో 44కు చేరిన కరోనా కేసులు..

418
corona
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 44కు చేరింది. ఇవాళ మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతను ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన డాక్టర్‌(41)తో పాటు ఆయన భార్య(36)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. భార్య కూడా డాక్టరే. భర్త నుంచి భార్యకు కరోనా వ్యాప్తి చెందింది.డాక్టర్లయినా భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -