కల్తీ మద్యం..35 మంది మృతి

8
- Advertisement -

తమిళనాడులోని కాళ్లకురిచిలో విషాదం నెలకొంది. నాటు సారా తాగిన ఘటనలో 35 మంది మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. అస్వస్థతకు గురైన మరో 60 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కల్తీ మద్యం ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. కలెక్టర్‌ని బదిలీ చేసిన సీఎం…జిల్లా ఎస్పీని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు, పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించాలని ఇద్దరు మంత్రులను ఆదేశించారు. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. ఈ క్రమంలో నిరక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం అని వెల్లడించారు సీఎం స్టాలిన్.

Also Read:హైదరాబాద్‌లో #SK30

- Advertisement -