రాష్ట్రంలో కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు..

286
Telangana
- Advertisement -

తెలంగాణలో రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు కాస్త తగ్గాయి. బుధవారం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,661కు చేరుకుంది. కోవిడ్‌-19 కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 40 మంది మృత్యువాతపడ్డారు. 608 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1,013 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

corona in ts

- Advertisement -