26 కోట్లతో నెక్లెస్​ రోడ్డు ఆధునీకరణ..

440
necklace road
- Advertisement -

జంటనగరాలను కలిపే నెక్లెస్​ రోడ్డును మరింత ఆధునీకరించాలని హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (హెచ్​ఎండీఏ) నిర్ణయించింది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నెక్లెస్​ రోడ్డు సుందరీకరణకు ప్రాధాన్యత కల్పించింది. ప్రస్తుతం ఉన్న బ్లాక్​ టాప్​ రోడ్డు(బీటీ రోడ్​)ను వాక్యూమ్​ డీవాటర్డ్​ సిమెంట్​ కాంక్రీట్​(వీడీసీసీ) రోడ్డుగా మార్చే పనులకు హెచ్​ఎండీఏ శ్రీకారం చుట్టంది.

దాదాపు రూ.26 కోట్ల వ్యయంతో ఆరు కిలోమీటర్ల పొడవున వీడీసీసీ రోడ్డు పనులు హెచ్​ఎండీఏ చీఫ్​ ఇంజినీర్​ బీఎల్​ఎన్​ రెడ్డి పర్యవేక్షణలో ఇంజినీరింగ్​ అధికారులు నిర్వహిస్తున్నారు.లాక్​డౌన్​ సమయంలో ట్రాఫిక్​ పోలీసు ఉన్నతాధికారుల అనుమతులతో పనులు ప్రారంభమయ్యాయి. నెక్లెస్​ రోడ్డు ప్రారంభం(ఖైరతాబాద్​ ఫ్లై ఓవర్​ బ్రిడ్జి వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహం) నుంచి సికింద్రాబాద్​ బుద్దభవన్​ సేలింగ్​ క్లబ్​ వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల పొడవు గల నెక్లెస్​ రోడ్డు(తారు రోడ్డు) కాస్తా సిమెంట్​ కాంక్రీట్​ రోడ్డు(సీసీ రోడ్డు)గా రూపొందనున్నది.

హెచ్​ఎండీఏ ఇంజినీరింగ్​ అధికారులు నెక్లెస్​ రోడ్డులో వీడీసీసీ రోడ్డు పనులు మూడు నెలల కాలంలో పూర్తి చేయాలని సంకల్పించారు. ట్రాఫిక్​ పోలీసుల సమన్వయంతో లాక్​డౌన్​ పిరియడ్​ ముగిసిన తర్వాత నెక్లెస్​ రోడ్డు వెంట ఒకవైపు ట్రాఫిక్​ను అనుమతిస్తూ పనులు నిర్వహించనున్నారు.

- Advertisement -