20మంది మావోయిస్టులు హతం

222
25 'Maoists' killed
- Advertisement -

ఛ‌త్తీస్ గ‌ఢ్‌లోని బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్‌ జరిగింది. జవాన్లు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ రోజు మావోయిస్టులు, జ‌వాన్ల మ‌ధ్య భారీగా కాల్పులు జ‌రిగాయి. ఎదురు కాల్పుల్లో మొత్తం 20 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మ‌రోవైపు సుక్మా జిల్లాలోని చింతల్నార్‌, చింత‌గుఫా ప్రాంతాల్లో 8 మంది మావోయిస్టుల‌ను సీఆర్పీఎఫ్ జ‌వాన్లు అరెస్టు చేశారు. ఎదురు కాల్పుల ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు తారసపడిన మావోయిస్టులు కోబ్రా యూనిఫాంలో ఉన్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో 350 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు పాల్గొన్నారు. తాల్చేరు ప్రాజెక్టు ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరిని అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి రూ.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని మావోయిస్టులకు సాయం చేసేవారిగా అనుమానిస్తున్నారు.

- Advertisement -