ఏపీలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..

45
coronavirus
- Advertisement -

ఏపీలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 85,822 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,442 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 477, చిత్తూరు జిల్లాలో 433, కృష్ణా జిల్లాలో 308, నెల్లూరు జిల్లాలో 248, ప్రకాశం జిల్లాలో 228 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 23 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2,412 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,444కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,73,996 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,40,368 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,184 మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -