సముద్ర మట్టానికి 18,380 అడుగుల ఎత్తులో TRS జెండా..

62
trs
- Advertisement -

ఓ 17 ఏండ్ల బాలుడు సైకిల్‌పై సాహసయాత్ర చేశాడు. ఆ బాలుడు ఏకంగా సైకిల్‌పై 2,600 కిలోమీటర్లు ప్రయాణించాడు. వివరాల్లోకి వెళ్లితే.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన వెంకటేశ్‌ సైకిల్‌పై కశ్మీర్‌ వరకు ప్రయాణం చేశాడు. పటాన్‌చెరు నుంచి కశ్మీర్‌కు 26 రోజుల్లో చేరుకొన్నాడు. సైకిల్‌పై 2,600 కిలోమీటర్లు ప్రయాణించి లఢక్‌ చేరకొన్నాడు.

అంతేకాదు ఈ యాత్రలో లఢక్‌కు చేరుకొన్న ఆ బాలుడు టీఆర్‌ఎస్‌ పార్టీ గులాబీ జెండాను రెపరెపలాడించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సీఎం కేసీఆర్‌, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చిత్రాలతో కూడిన గులాబీజెండాను ప్రదర్శించి టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపాడు. ఆదివారం కశ్మీర్‌లోని లఢక్‌-ఖార్‌దుంగ్‌ లాపాస్‌ వద్ద వెంకటేశ్‌ ‘జై తెలంగాణ, జై టీఆర్‌ఎస్‌’ నినాదాలు చేశాడు. సముద్ర మట్టానికి 18,380 అడుగుల ఎత్తులో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశాడు.

- Advertisement -