అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 128 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు అంత్యక్రియలు చేయనున్నారు. 1895 నవంబర్ 19న చనిపోయిన వ్యక్తికి అక్టోబర్ 7న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అతనో చిన్న దొంగ. జైలులో ఉండగా కిడ్నీ సమస్యలతో చనిపోయాడు. అయితే అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించటానికి జైలు అధికారులకు, పోలీసులకు అతని వివరాలు తెలియలేదు. దీంతో మృతదేహాన్ని మమ్మీగా మార్చి భద్రపరిచారు.
జైలుకు తీసుకొచ్చిన సమయంలో నమోదు చేసుకున్న వివరాలతో అతని బంధువుల గురించి అన్వేషించారు. వారి చిరునామా తెలియలేదు. ఈ మమ్మీని చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. 128 ఏళ్లు దాటినా ఈ మమ్మీ వెంట్రుకలు, దంతాలు చెక్కు చెదర్లేదు.ఇక చివరికి మమ్మీకి తామే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించామని …వీధుల గుండా మమ్మీ అంతిమయాత్ర నిర్వహించేందుకు ఏర్పాటుచేస్తున్నారు.
Also Read:లవర్స్ని థ్రిల్ చేయనున్న”తంతిరం”