దేశంలో కరోనా తగ్గముఖం..

119
corona
- Advertisement -

దేశంలో కరోనా తగ్గముఖం పడుతున్నది. గత 24 గంటల్లో 12,584 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 18,385 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,79,179కు చేరిందని తాజా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది. ఇప్పటి వరకు 1,01,11,294 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పింది.

కొత్తగా మరో 167 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,51,327కు పెరిగాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. 24గంటల్లో 8,97,056 టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 18,26,52,887 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.

- Advertisement -