ఏపీలో కొత్తగా 11,421 కరోనా పాజిటివ్ కేసులు..

125
- Advertisement -

ఏపీలో గత కొన్నిరోజులుగా కరోనా రోజువారీ కేసుల్లో భారీగా తగ్గుతూ వస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 86,223 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,421 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 2,308 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1,658 కేసులు, అనంతపురం జిల్లాలో 1,041 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 318 కొత్త కేసులు గుర్తించారు.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 16,223 మంది కరోనా నుంచి కోలుకోగా, 81 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 13 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 17,28,577 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 15,78,452 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,38,912 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 11,213కి చేరింది. ఇటీవల 25 శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు ఇప్పుడు 13 శాతంగా నమోదైంది.

- Advertisement -