ఏపీలో కొత్తగా 1,115 కరోనా కేసులు నమోదు..

161
Nurse wearing respirator mask holding a positive blood test result for the new rapidly spreading Coronavirus, originating in Wuhan, China
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల నమోదు స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 52,319 మంది శాంపిల్స్ ను పరీక్షించగా 1,115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 210 కేసులు నమోదు కాగా.. కర్నూలులో కేవలం 9 కేసులు మాత్రమే వచ్చాయి.

ఇదే సమయంలో 1,265 మంది కరోనా నుంచి కోలుకోగా… 19 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,14,116కి పెరిగింది. 19,85,566 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,857 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,693 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -