తెలంగాణలో కొత్తగా 1,114 కరోనా కేసులు నమోదు..

111
covid 19
- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి.తాజా కేసులకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,114 కరోనా కేసులు వెలుగు చూడగా, 12 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,16,688కి పెరిగింది. 3,598 మంది మరణించారు. నిన్న ఒక్క రోజే 1280 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 5,96,628 మంది కరోనా నుంచి బయటపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న 129 కేసులు మాత్రమే వెలుగుచూడగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా తాజా క‌రోనా పాజిటివ్ కేసుల వివ‌రాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్‌-2, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-59, జీహెచ్ఎంసీ-129, జ‌గిత్యాల‌-23, జ‌న‌గాం-11, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి-21, జోగులాంబ గ‌ద్వాల‌-7, కామారెడ్డి-3, క‌రీంన‌గ‌ర్‌-69, ఖ‌మ్మం-69, కొమురంభీం ఆసిఫాబాద్‌-6, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-23, మ‌హ‌బూబాబాద్‌-44, మంచిర్యాల‌-49, మెద‌క్‌-8, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి-58, ములుగు-24, నాగ‌ర్‌క‌ర్నూలు-12, న‌ల్ల‌గొండ‌-72, నారాయ‌ణ‌పేట‌-6, నిర్మ‌ల్‌-3, నిజామాబాద్‌-8, పెద్ద‌ప‌ల్లి-53, రాజ‌న్న సిరిసిల్ల‌-16, రంగారెడ్డి-75, సంగారెడ్డి-16, సిద్దిపేట‌-44, సూర్యాపేట‌-69, వికారాబాద్‌-14, వ‌న‌ప‌ర్తి-17, వ‌రంగ‌ల్ రూర‌ల్‌-16, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌-53, యాదాద్రి భువ‌న‌గిరి-35.

దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.3 శాతంగా ఉండగా, తెలంగాణలో ఇది 0.58 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రికవరీ రేటు కూడా మెరుగ్గానే ఉంది. దేశంలో ఇది 96.52 శాతంగా ఉండగా, తెలంగాణలో 96.74 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఇంకా 16,462 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నిన్న ఒక్క రోజే 1,18,109 పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం వివరించింది.

- Advertisement -