ఏపీలో మళ్ళీ కరోనా వ్యాప్తి..

190
- Advertisement -

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 45,077 కరోనా పరీక్షలు నిర్వహించగా 102 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 56 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,90,317 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,275 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 871 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య 7,171కి చేరింది. ఇక కొత్తగా నమోదైన కేసులలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

- Advertisement -