గ్రీన్ ఛాలెంజ్.. వందేళ్ల చెట్టుకు రీ ప్లాంటేషన్..

164
- Advertisement -

నేరేడుచర్ల పట్టణంలో హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి చొరవ మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నేరేడుచర్లలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు వంద సంవత్సరాల నుండి నేరేడుచర్ల పరిసర గ్రామ ప్రజలకు నీడనిచ్చి.. ఎంతో మంది తోపుడుబండ్ల వారికి ఉపాధి నిచ్చి.. ఎంతో సేవ చేసిన ఓ రావి చెట్టును నేరేడుచర్ల ప్రజల కోరిక మేరకు రీ ప్లాంటేషన్ చేయాలని రంగం సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే సైదిరెడ్డికి విన్నవించగా ఆయన స్పందించి గ్రీన్ ఇండియా ఛాలెంజ కో పౌండర్ రాఘవని, వాటా ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్ కృష్ణను పంపించారు. వారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వచ్చి చెట్టును చూసి మూడు స్థలాలను పరిశీలించారు.

పరిశీలకులు మాట్లాడుతూ చెట్టును మార్చడంలో సహాయపడతామని వాతా ఫౌండేషన్ నుండి వాలంటీర్లతో కలసి వారు 4 కొమ్మలను కొత్త చెట్లుగా కూడా పాతడానికి ప్రయత్నిస్తమన్నారు. ప్రజల మన్నన మేరకు, అధికారుల సలహా మేరకు వారు చూపించిన స్థలంలో మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు రీ ప్లాంటేషన్ చేయడానికి నిర్ణయించినామని త్వరలో పనులను ప్రారంభిస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యశోద రాములు, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, టిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, కౌన్సిలర్స్ వేమూరినారాయణ, skభాష, తాళ్లూరి సాయి, పార్టీ అధికార ప్రతినిధి వింజమూరి మల్లయ్య, ప్రచార కార్యదర్శి బుడిగే చంద్రయ్య గౌడ్, టిఆర్ఎస్ పట్టణ నాయకులు కట్టా కళావతి, ఎస్.కె కైరున్, తెరాస నాయకులు నాగండ్ల శ్రీధర్, ఆకారపు వెంకటేశ్వర్లు, చిట్యాల శ్రీనివాస్, బొడ్డుపల్లి సుందరయ్య, సురసాని వెంకన్న గౌడ్, పిల్లలమర్రి పుల్లారావు, చెరుకుపల్లి నరసింహ, పాశం లుకాస్, గంట సైదులు, వింజమూరి శ్రీనివాస్, రూపాని ఉదయ్, నక్క గిరి, జెట్టి వెంకన్న, కాలం నాగయ్య, ఎస్కే సైదా, వింజమూరి రాజేష్, కొమర్రాజు వెంకట్, కొప్పు రామకృష్ణ, తిక్కల శ్రీకాంత్, నందిపాటి మహేష్, మారుపాక నాగరాజు, ఎస్కే రియాజ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -