గులాబీ గూటికి మరో100 మంది ..

184
TDP leaders join TRS
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే టీఆర్‌ ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు అకర్షితులై ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా..చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య సమోక్షంలో శంకర్‌ పల్లి మండలం ఎల్వర్తీకి చెందిన 100 మంది టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వచ్చందంగా కలిసివచ్చి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి మహేందర్‌ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల
కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ప్రతి పక్షాల అడ్రస్‌ గల్లంతవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -