సీఎం కేసీఆర్ పిలుపు…ముందుకొచ్చిన టాలీవుడ్

194
chiru
- Advertisement -

హైదరాబాద్ భారీ వర్షాల నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకురావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మేఘా ఇంజనీరింగ్ సంస్ధ,ఢిల్లీ సీఎం, తమిళనాడు సీఎం,తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం ముందుకొచ్చి పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి.

తాజాగా టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి,నాగార్జున,మహేష్‌తో పాటు పలువురు ముందుకొచ్చారు. చిరంజీవి కోటి రూపాయ‌లు, మ‌హేష్ బాబు రూ.కోటి రూపాయ‌లు, నాగార్జున రూ. 50 ల‌క్ష‌లు, ఎన్టీఆర్ రూ. 50 ల‌క్ష‌లు, విజ‌య్ దేవ‌ర‌కొండ రూ.10 ల‌క్ష‌లు, హ‌రీష్ శంక‌ర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 ల‌క్ష‌లు విరాళాన్ని ప్రకటించారు.

- Advertisement -