శ్రీవారి సేవలో పీవీ సింధు, గోపీచంద్

196
tirumala
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం ఉదయం రియో ఒలింపిక్స్ రజత పతక విజేత షట్లర్ పీవీ సింధు ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్‌తో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సింధు, ఆమె కుటుంబసభ్యులు సహా కోచ్ గోపీచంద్ స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆలయ అధికారులు వారికి ఆహ్వానం పలికి ఏడుకొండల వాడి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు.దర్శనం అనంతంరం సింధు స్వామి వారికి తులాభారంగా 68 కేజీల బెల్లాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం సింధు, గోపిచంద్ కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

unnamed (3)

unnamed (1)

- Advertisement -