వైసిపి లో చేరిన ప్రముఖ టాలీవుడ్ యాంకర్ దంపతులు

756
anchor Shyamala joins ysrcp
- Advertisement -

ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసిపిలోకి వలసలు కొనసాగుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నుంచి పలువురు వైసీపీలో చేరుతుండగా అటు సినీమా ఇండస్ట్రీ నుంచి కూడా ఇప్పటికే చాలా మంది వైసీపీలో చేరారు. ఇటివలే కమెడీయన్ అలీ, సీనియర్ నటీ జయసుధ, శివాజిరాజా, తనిష్, జీవిత రాజశేఖర్ లు చేరగా తాజాగా మరో టీవి యాంకర్ వైసిపిలో చేరింది.

యాంకర్ శ్యామల దంపతులు నేడు లోటస్ పౌండ్ లో జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. యాంకర్ శ్యామల తన భర్త నర్సింహారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఈసందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడుతూ..వైసిపి కుటుంబంలో కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

చాలా కాలం నుంచి జగన్ అన్నను పరిశీలిస్తున్నామని..ఆయన చేసిన మంచి పనులు తనకు ఎంతో నచ్చాయన్నారు శ్యామల. జగన్ అన్న చెబుతున్న నవరత్నాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, మద్యపాన నిషేధం, ఆరోగ్యశ్రీ పథకాలు తమకు ఎంతో నచ్చాయని చెప్పారు. తనకు సపోర్ట్ గా తన భర్త కూడా వచ్చారని తెలిపారు. తాము కూడా వైసీపీ ప్రచారంలో పాలుపంచుకోబోతున్నామని చెప్పారు. ఎపీ ప్రజలందరూ జగనన్న కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

- Advertisement -