రోడ్డెక్కిన జగపతి బాబు

183
Jagapathi babu
- Advertisement -

భాగ్యనగరంలో ప్రముఖ బిల్డర్స్‌గా పేరుగాంచిన లోధా బిల్డర్స్ మోసానికి పాల్పడిందని సినీ నటుడు జగపతి బాబు చెప్పారు. లోధా బిల్డర్స్ వద్ద అపార్టుమెంట్లు కొని మోసపోయిన పలువురు కొనుగోలుదారులతో కలిసి మీడియాతో మాట్లాడిన జగపతి బాబు.. లోధా బిల్డర్స్ నిబంధనలకు విరుద్ధంగా అపార్టుమెంట్లు నిర్మించిందని తెలిపారు. కూకట్ పల్లిలో ఎన్నో ఆశలతో సొంతింటి కళను సాకారం చేసుకోవాలని కోట్ల రూపాయలు పెట్టి ప్లాట్లు కొన్నవారిని లోదా యాజమాన్యం మోసం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2011లో తమకు ఇళ్లను విక్రయించే సమయంలో లోదా మెరిడియన్ అనే మరో ప్రాజెక్టు గురించి చెప్పకుండా ఇపుడు ఆ నిర్మాణం చేపట్టి లోదా మెరిడియన్, బెల్లేజా అపార్ట్‌మెంట్ల మధ్య గోడ నిర్మించిందని, ఇపుడు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ గోడను కూల్చివేస్తామంటున్నారని అన్నారు. తమను లోదా యాజమాన్యం మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని, తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని జగపతిబాబు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ స్పందించకపోతే కోర్టుకు వెళతామని బాధితులు చెబుతున్నారు.

- Advertisement -