యూఎస్‌ ఓపెన్‌లో భారత్‌ శుభారంభం

605
- Advertisement -

యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో భారత టెన్సిస్‌ ఆటగాళ్లు సానియా మీర్జా, లియాండర్‌ పేస్‌, రోహన్‌ బోపన్నలు శుభారంభం చేశారు. తొలిరౌండ్‌ మహిళల, పురుషుల, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో వీరు తమ పార్ట్‌నర్స్‌తో కలిసి విజయం సాధించారు. మహిళల డబుల్స్లో సానియా మీర్జా-బార్బోరా స్టికోవా( చెక్ రిపబ్లిక్) జోడి గెలుపొందింది. 6-3, 6-2 వరుస సెట్లతో నెగ్గిన సానియా జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మిక్స్డ్ డబుల్స్లో లియాండర్ పేస్- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించగా, పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న-ఫ్రెడిక్ నీల్సన్(డెన్మార్) జంట విజయం సాధించింది.

us open

మిక్స్డ్ డబుల్స్లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన పేస్-హింగిస్ల ద్వయం 6-3, 6-2 తేడాతో సాచియా వికెరీ(అమెరికా)-తైఫో(ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. 51 నిమిషాల పాటు జరిగిన పోరులో పేస్ హింగిస్లు వరుస సెట్లను కైవసం చేసుకున్నారు. ఇక పురుషుల డబుల్స్లో బోపన్న- నీల్సన్ జంట 6-3, 6-7(3), 6-3 తేడాతో పదహారో సీడ్ రాడెక్ స్టెపనాక్(చెక్ రిపబ్లిక్)- నెనాడ్ జిమోంజిక్(సెర్బియా)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి చేరింది.

serena

టెన్నిస్‌ ఓపెన్‌లో అత్యధిక సింగిల్స్‌ టైటిళ్లు గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాలని తహతహలాడుతున్న మహిళల ప్రపంచ నెంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) ఆ దిశగా ముందంజ వేసింది. యుస్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పదునైన సర్వీసులతో చెలరేగిన ఆమె తొలి రౌండ్లో 6-3, 6-3తో ఏక్తరినా మకరోవా (రష్యా)పై అలవోకగా గెలిచింది. సెరెనా 12 ఏస్‌లు, 27 విన్నర్లు కొట్టింది. సెరెనా ఇక్కడ టైటిల్‌ సాధిస్తే ఓపెన్‌ శకం రికార్డు (22 టైటిళ్లు)ను బద్దలు కొడుతుంది. ఈ రికార్డును ఆమె ప్రస్తుతం స్టెఫీగ్రాఫ్‌తో కలిసి పంచుకుంటోంది. ఆల్‌టైమ్‌ రికార్డు మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిళ్లు) పేరిట ఉంది.

- Advertisement -