ముసి ముసి నవ్వుల్లో మహేష్‌..

209
Online News Portal
Tollywood Prince Mahesh in children smile
- Advertisement -

మహేశ్‌బాబు ప్రస్తుతం ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. చక్కటి ఈ దృశ్యం ఆ సినిమా సెట్‌లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చిన్నారుల మ‌ధ్య చిరునవ్వులు చిందిస్తూ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు దిగిన తాజా ఓ ఫొటో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. మిల్కీ బాయ్‌తో చిన్నారులు ఫొటో దిగుతున్నందుకు ఎంతో సంబరప‌డిపోయారు.

mahesh

సినిమాల్లో క‌నిపించే మ‌హేశ్‌బాబు త‌మ ప‌క్క‌న ఉండ‌డంతో ఆకాశమంత ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఎంతో సంబరపడిపోతూ ‘శ్రీమంతుడు’ పక్కన నిలబడి ఫోజులిచ్చారు. చిన్నారుల్లో క‌లిసిపోయిన మహేశ్‌బాబు వారిలాగే న‌వ్వుతూ కెమెరా వంక చూశారు. మహేశ్‌ కూడా ఏం తీసిపోలేదు.. చిన్నారుల‌తో ఫొటో దిగడానికి ఆయనకూడా ‘దూకుడు’ చూపించారు.

ప్రతి సినిమాకు మహేష్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ సినిమా విషయంలో కూడా తన లుక్ గత సినిమా కంటే భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసారు. ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నారు. ఈచిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మహేష్, మురుగదాస్ ల సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. 2017 వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబరు కల్లా షూటింగ్ పూర్తి చేస్తారని, పొంగల్ నాటికి ఇది రిలీజ్ కావచ్చునని అంటున్నారు.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో పాల్గొన్న రకుల్ స్వల్పంగా గాయపడింది. రకుల్ వేలు ఫ్యాక్చర్ అయినట్టుగా వార్తలు రావటంతో ఆమె సన్నిహితులు అభిమానుల ఆందోళన చెందారు.

- Advertisement -