ముందు నీ దేశం పరిస్థితి చూసుకో- ధావన్

486
shiikar-Dhawan
- Advertisement -

కశ్మీర్ అంశంపై నేరుపారేకున్న ఆప్రిదికి భారత్ క్రికెటర్లు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఘాటుగా స్పందించాడు. ముందు నీ దేశం పరిస్థితి చక్కదిద్దుకో. నీ ఆలోచన నీ దగ్గరే పెట్టుకో అంటూ దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు. భవిష్యత్తులోనూ ఏం చెయ్యాలో మాకు తెలుసు. అనవసరం గా మాగురించి ఆలోచించకంటూ కౌంటరిచ్చాడు.

dhawan

కశ్మీర్‌లో స్వీయ నిర్ణయాధికారం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న అమాయకులను అణచివేస్తున్నారని, ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని అఫ్రిది డిమాండ్ చేశాడు. అయితే అతని వ్యాఖ్యలను గంభీర్, కోహ్లి, రైనా, కపిల్ దేవ్ ఖండించారు. అది ,చెప్పడానికి.. అఫ్రిది ఎవరు, ఇలాంటి వాళ్లకు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు? అపి కపిల్ దేశ్ అన్నారు. ఏదో ఒక మూల కూర్చుని మాట్లాడే ఇలాంటి వాళ్లపై స్పందించకపోవడమే ఉత్తమం అని కపిల్ పేర్కొన్నారు.

సచిన్ టెండూల్కర్ దీటైన కూడా కౌంటర్ వేశాడు. మేం ఏం చేయాలో బయటి వ్యక్తులు చెపాల్సిన అవసరం లేదని సచిన్ పేర్కొన్నాడు.అఫ్రిది వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాన్నాడు. మా దేశాన్ని ఎలా నడపాలో మాకు తెలుసని కౌంటర్ ఇచ్చాడు.

- Advertisement -