మనీషాకి మళ్లీ వయసొచ్చింది..!

279
- Advertisement -

బొంబాయి, ఒకే ఒక్కడు చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయిన మనీషా కొయిరాలా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న మనీషా కొయిరాలా ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన ఈ నేపాలీ బ్యూటీ, ఇప్పుడు సౌత్ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది.

manisha-koirala

తాజాగా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అంటుంది.బాలీవుడ్ లో టాప్ హీరోలతో జత కట్టిన ఈ నేపాలీ భామ , ఆ తర్వాత అవకాశాలు తగ్గడం తో నేపాల్ కు చెందిన సామ్రాట్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడి, రెండేళ్లకే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుండడం, క్యాన్సర్ కూడా తగ్గిపోవడం తో ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందని, ఒంటరి జీవితం గడపడం కష్టమంటూ చెప్పుకొచ్చింది.

manisha-koirala_marriage

ప్రస్తుతం హిందీలో ‘డియర్ మాయ’, ‘మౌలాలి’ సినిమాలు ఆమె చేస్తున్నారు. వచ్చే ఏడాది ఓ అమ్మాయిని దత్తత తీసుకోవాలనుంది. నా కుటుంబ సభ్యులు నేపాల్‌లో ఉంటారు. ముంబయ్‌లో సెటిలయ్యాక ఒంటరిగా ఫీలవుతున్నా. ఎవ‌రైనా తోడు ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే ఎవరినైనా దత్తత తీసుకోవాలని ఉంది అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌తో పాటు తమిళ్ లో నటిస్తున్న ఈ నేపాలీ బ్యూటీ తెలుగులో కూడా కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే నాగార్జున, కృష్ణవంశీ లాంటి ప్రముఖులతో టచ్ లో ఉంది మనీషా.

- Advertisement -