పాకిస్తాన్ కు రాజ్‌నాథ్ వార్నింగ్….

172
Rajnath Singh warns Pakistan, says India can attack its enemies on foreign soil
- Advertisement -

అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ సైన్యంపై కాల్పులకు తెగబడుతోన్న పాక్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ తలొగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఏమాత్రం బలహీన దేశం కాదని, శత్రువులపై మా భూభాగం నుంచే కాదు, అవసరమైతే వారి దేశంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Rajnath Singh warns Pakistan, says India can attack its enemies on foreign soil

యూపీ పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ ఓ సభలో మాట్లాడారు. పూంచ్ సెక్టార్‌లో ఐదుగురు ఆర్మీ కమాండోలు సరిహద్దు రేఖను దాటివెళ్లి పాక్ సైనికులకు హతమార్చిన నెల రోజుల తర్వాత రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడితో కేరీ సెక్టార్‌లో నలుగురు భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పాక్ సైన్యంపై ఆర్మీ బదులు తీర్చుకుంది.

- Advertisement -