దేశం మొత్తానికి బియ్యం అందించబోతున్న తెలంగాణ..

148
- Advertisement -

భారతదేశం మొత్తానికి బియ్యాన్ని అందించబోతున్న తెలంగాణ రాష్ట్రం. ఇది కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పంతోనే సాధ్యం అయినది అని టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కిషోర్ గౌడ్ తెలిపారు. అనుకున్న సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టులను కూడ నిర్మాణం పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులు ఇక మాకు నీళ్ళు చాలు అనే వరకు నీటిని విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే.

కాళేశ్వరం నీటిని వినియోగించు కోవటం కోసం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించి. రైతులకు పెట్టుబడి కోసం ఎకరాకు 5 వేల రూపాయలు (2 పంటలకు 10వేల రూపాయలు) అందించడం ద్వారా రైతులు ఎలాంటి బాధలు లేకుండా తమ వ్యవసాయ పనులు ఆనందంగా చేసుకోవడంతోనే ఈ రోజు భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా వరిని పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది అని చెప్పుటకు ఆనందిస్తాము. మరోక్కసారి ముఖ్యమంత్రి కెసిఆర్ కి తెలంగాణ రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కిషోర్ గౌడ్. ఈ విషయాన్ని ఎంపీ సంతోస్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

- Advertisement -