తిరుపతికి పవన్ కల్యాణ్‌

610
- Advertisement -

సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఓ కార్యక్రమంలో ఇద్దరు హీరోలకు చెందిన అభిమానులు ఘర్షణ పడగా.. ఈ ఘటనలో వినోద్‌ కత్తిపోట్లకు గురై స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వినోద్‌ మృతి తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ ఈరోజు తిరుపతికి చేరుకుని అతడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

కర్ణాటక పరిధిలోని కోలార్ లోని కోలార్ లో జరిగిన ఘర్షణలో టాలీవుడ్ యంగ్ హీరో అభిమాని కత్తితో దాడి చేయడంతో వినోద్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ మరునాడు అతడి మృతదేహాన్ని తిరుపతికి తీసుకునివచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్ బంధువులతో పాటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

వినోద్ మరణానికి కారణమైన యంగ్ హీరో అభిమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వినోద్ స్నేహితులు, కేసును సీబీసీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాజాగా నేడు వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ తిరుపతి వెళుతున్నారు. దీంతో నిన్నటిదాకా కాస్తంత సద్దుమణిగిందనుకున్న ఈ వివాదం గంటల వ్యవధిలోనే తీవ్ర రూపం దాల్చింది. వినోద్ ను చంపేసిన యంగ్ హీరో అభిమానిపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిరసనలకు తెర తీశారు. వెరసి పవన్ కల్యాణ్ పర్యటనతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

- Advertisement -